ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...
- November 14, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యంగల ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట కనిపించిందని ఇటీవలే పట్టుబడిన ఆ సంస్థ ఉగ్రవాది సుబహాని హాజా మొయిదీన్ (31) తెలిపాడు. తమిళనాడుకు చెందిన సుబహానిని అక్టోబరు 6న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సుబహాని ఐఎస్ ప్రాబల్య ప్రాంతంలో ఐదు నెలలపాటు ఉన్నాడు. ఆ సంస్థ తరపున మోసుల్లో పోరాడాడు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ ప్రేరణతో ఆరుగురు కేరళవాసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నపుడు సుబహానిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సుబహాని శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూండగా అరెస్టు చేశారు.అతనిని విచారించినపుడు తాను ఐఎస్ యుద్ధ భూమిలో మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడిని చూశానని, ఆ మహిళతో ఓ బహిరంగ ప్రదేశంలో మాట్లాడానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ మహిళలు ఐఎస్లో ఉన్నట్లు పక్కా సమాచారం లేదని, సుబహాని చెప్తున్న మహిళ గురించి మాత్రమే తెలిసిందని వివరించారు.
తాజా వార్తలు
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..









