ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...
- November 14, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యంగల ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట కనిపించిందని ఇటీవలే పట్టుబడిన ఆ సంస్థ ఉగ్రవాది సుబహాని హాజా మొయిదీన్ (31) తెలిపాడు. తమిళనాడుకు చెందిన సుబహానిని అక్టోబరు 6న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సుబహాని ఐఎస్ ప్రాబల్య ప్రాంతంలో ఐదు నెలలపాటు ఉన్నాడు. ఆ సంస్థ తరపున మోసుల్లో పోరాడాడు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ ప్రేరణతో ఆరుగురు కేరళవాసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నపుడు సుబహానిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సుబహాని శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూండగా అరెస్టు చేశారు.అతనిని విచారించినపుడు తాను ఐఎస్ యుద్ధ భూమిలో మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడిని చూశానని, ఆ మహిళతో ఓ బహిరంగ ప్రదేశంలో మాట్లాడానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ మహిళలు ఐఎస్లో ఉన్నట్లు పక్కా సమాచారం లేదని, సుబహాని చెప్తున్న మహిళ గురించి మాత్రమే తెలిసిందని వివరించారు.
తాజా వార్తలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!









