ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...

- November 14, 2016 , by Maagulf
ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యంగల ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట కనిపించిందని ఇటీవలే పట్టుబడిన ఆ సంస్థ ఉగ్రవాది సుబహాని హాజా మొయిదీన్ (31) తెలిపాడు. తమిళనాడుకు చెందిన సుబహానిని అక్టోబరు 6న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సుబహాని ఐఎస్ ప్రాబల్య ప్రాంతంలో ఐదు నెలలపాటు ఉన్నాడు. ఆ సంస్థ తరపున మోసుల్‌లో పోరాడాడు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ ప్రేరణతో ఆరుగురు కేరళవాసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నపుడు సుబహానిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సుబహాని శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూండగా అరెస్టు చేశారు.అతనిని విచారించినపుడు తాను ఐఎస్ యుద్ధ భూమిలో మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడిని చూశానని, ఆ మహిళతో ఓ బహిరంగ ప్రదేశంలో మాట్లాడానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ మహిళలు ఐఎస్‌లో ఉన్నట్లు పక్కా సమాచారం లేదని, సుబహాని చెప్తున్న మహిళ గురించి మాత్రమే తెలిసిందని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com