ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట...
- November 14, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యంగల ఇరాక్-సిరియా ప్రాంతంలో ఓ భారతీయ జంట కనిపించిందని ఇటీవలే పట్టుబడిన ఆ సంస్థ ఉగ్రవాది సుబహాని హాజా మొయిదీన్ (31) తెలిపాడు. తమిళనాడుకు చెందిన సుబహానిని అక్టోబరు 6న ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. సుబహాని ఐఎస్ ప్రాబల్య ప్రాంతంలో ఐదు నెలలపాటు ఉన్నాడు. ఆ సంస్థ తరపున మోసుల్లో పోరాడాడు. బీజేపీ, ఆరెస్సెస్ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులపై దాడులకు పాల్పడేందుకు ఐఎస్ ప్రేరణతో ఆరుగురు కేరళవాసులు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నపుడు సుబహానిని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సుబహాని శివకాశి నుంచి పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తూండగా అరెస్టు చేశారు.అతనిని విచారించినపుడు తాను ఐఎస్ యుద్ధ భూమిలో మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ, ఒక పురుషుడిని చూశానని, ఆ మహిళతో ఓ బహిరంగ ప్రదేశంలో మాట్లాడానని చెప్పినట్లు ఎన్ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటి వరకు భారతీయ మహిళలు ఐఎస్లో ఉన్నట్లు పక్కా సమాచారం లేదని, సుబహాని చెప్తున్న మహిళ గురించి మాత్రమే తెలిసిందని వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







