ఖతార్ నుంచి బహ్రెయిన్కి ఫెర్రీ: వచ్చే ఏడాదిలో
- November 14, 2016
స్థానిక సంస్థ ఒకటి, తొలి ప్యాసింజర్ మరియు వెహికిల్ ఫెర్రీని పర్యాటకుల్ని ఆకర్షించేందుకుగాను ఖతార్ - బహ్రెయిన్ మధ్య నడపడానికి యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ ఫెర్రీ అందుబాటులోకి రావొచ్చు. ఖతార్లోని అల్ రువాయిస్ పోర్ట్ నుంచి బహ్రెయిన్లోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ వరకు ఈ ఫెర్రీ నడవనుంది. ఈ ఫెర్రీలో కొన్ని పర్సనల్ అలాగే కమర్షియల్ వెహికిల్స్ని కూడా తీసుకెళ్ళే అవకాశముంది. ఈ తరహాలో ఇదే గల్ఫ్ దేశాల్లో తొలి ఫెర్రీ కానుందని సమాచారమ్. బహ్రెయిన్ నుంచి ఖతార్ వెళ్ళేందుకు రోడ్డు మార్గంలో 4.5 గంటల సమయం పట్టనుండగా, ఫెర్రీ ద్వారా కేవలం 1.5 నుంచి 2.5 గంటల్లోనే చేరుకునే అవకాశముంటుంది. ఖతార్ - బహ్రెయిన్ మధ్య దూరం తగ్గించేందుకు కాజ్వే నిర్మాణం జరపాలనే యోచన చేసినప్పటికీ కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. బహ్రెయిన్కి వెళ్ళే ఫెర్రీ సక్సెస్ అయితే, ఖతార్ నుంచి యూఏఈకి కూడా భవిష్యత్తులో ఫెర్రీలు నడిపే అవకాశం ఉంటుంది. గతంలో ఓ కమర&ఇషయల్ ఫెర్రీ ఖతార్ మరియు ఇరాన్ మధ్య నడిచినా, కొన్ని అనివార్య కారణాలతో కొంత కాలం క్రితమే ఆ సర్వీస్ రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







