ఖతార్ నుంచి బహ్రెయిన్కి ఫెర్రీ: వచ్చే ఏడాదిలో
- November 14, 2016
స్థానిక సంస్థ ఒకటి, తొలి ప్యాసింజర్ మరియు వెహికిల్ ఫెర్రీని పర్యాటకుల్ని ఆకర్షించేందుకుగాను ఖతార్ - బహ్రెయిన్ మధ్య నడపడానికి యోచిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ ఫెర్రీ అందుబాటులోకి రావొచ్చు. ఖతార్లోని అల్ రువాయిస్ పోర్ట్ నుంచి బహ్రెయిన్లోని ఖలీఫా బిన్ సల్మాన్ పోర్ట్ వరకు ఈ ఫెర్రీ నడవనుంది. ఈ ఫెర్రీలో కొన్ని పర్సనల్ అలాగే కమర్షియల్ వెహికిల్స్ని కూడా తీసుకెళ్ళే అవకాశముంది. ఈ తరహాలో ఇదే గల్ఫ్ దేశాల్లో తొలి ఫెర్రీ కానుందని సమాచారమ్. బహ్రెయిన్ నుంచి ఖతార్ వెళ్ళేందుకు రోడ్డు మార్గంలో 4.5 గంటల సమయం పట్టనుండగా, ఫెర్రీ ద్వారా కేవలం 1.5 నుంచి 2.5 గంటల్లోనే చేరుకునే అవకాశముంటుంది. ఖతార్ - బహ్రెయిన్ మధ్య దూరం తగ్గించేందుకు కాజ్వే నిర్మాణం జరపాలనే యోచన చేసినప్పటికీ కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు. బహ్రెయిన్కి వెళ్ళే ఫెర్రీ సక్సెస్ అయితే, ఖతార్ నుంచి యూఏఈకి కూడా భవిష్యత్తులో ఫెర్రీలు నడిపే అవకాశం ఉంటుంది. గతంలో ఓ కమర&ఇషయల్ ఫెర్రీ ఖతార్ మరియు ఇరాన్ మధ్య నడిచినా, కొన్ని అనివార్య కారణాలతో కొంత కాలం క్రితమే ఆ సర్వీస్ రద్దు చేయబడింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







