డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో రిమాండ్‌ పొడిగింపు

- November 15, 2016 , by Maagulf
డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో రిమాండ్‌ పొడిగింపు

మనామా: హై క్రిమినల్‌ కోర్ట్‌, నలుగురు థాయ్‌ మహిళల రిమాండ్‌ని 15 రోజులపాటు పొడిగించింది. డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. కింగ్‌డమ్‌లో 'షాబు' అనే మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. మామా పేరుతో థాయిలాండ్‌లో నివసిస్తున్న మరో మహిళతో కలిసి మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్నారు. యాంటీ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌కి అందిన పక్కా సమాచారంతో, పోలీసులు స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి, ఈ ముఠాని పట్టుకున్నారు. మహిళలు వినియోగించే హ్యాండ్‌ బ్యాగ్స్‌ ద్వారా బహ్రెయిన్‌లోకి డ్రగ్స్‌ తీసుకొస్తున్నట్లు విచారణలో నలుగురు థాయ్‌ మహిళలు అంగీకరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com