పెద్దనోట్ల రద్దు ప్రభావం విదేశీ పర్యాటకులపై.....!
- November 16, 2016
పెద్దనోట్ల రద్దు ప్రభావం విదేశీ పర్యాటకులపైనా బాగానే పడింది. ఈనెల 8న అమెరికా నుంచి తన స్నేహితులతో దిల్లీ వచ్చిన రెట్ అనే పర్యాటకుడు డాలర్లను రూపాయలతో మార్పిడి చేసుకున్నాడు. అయితే, భారత ప్రధాని నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ హఠాత్తుగా చేసిన ప్రకటనతో రెట్, తదితరుల వద్ద ఉన్న భారత్ కరెన్సీ ఎందుకూ పనికి రాకుండా పోయింది. తాము బసచేసిన హోటళ్ల వారు ఆ నోట్లను స్వీకరించలేదని రెట్ చెప్పారు. కరెన్సీ మార్పిడి వసతి కూడా లేకపోవడంతో తాము దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. చివరకు తాము హాజరైన ఓ భారతీయుల పెళ్లిలో ఇచ్చేశామన్నారు. .బ్రిటన్ నుంచి వచ్చి పర్యాటకురాలు ప్యాట్రీషియా హేమ్స్ కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.ట్యాక్సీలకు చెల్లించాలంటే కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు ద్వారానే పనులన్నిటినీ పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. అయితే, స్థానిక మార్కెట్ల నుంచి చిన్నచిన్న వస్తువులు కొనుక్కుందామంటే చేతిలో డబ్బు చాలక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. కళాఖండాల కొనుగోలూ ఇబ్బందికరంగా తయారైందన్నారుతన తల్లితో కలిసి బ్రెజిల్ నుంచి వచ్చిన ఆక్టావియో ఫ్రాంకో కూడా నానా అగచాట్లూ పడుతున్నారు. ఏటీఎంల దగ్గర చాంతాడంత క్యూలు ఉంటున్నాయ న్నారు. చాలా మంది విదేశీ పర్యాటకులు ఇలాంటి ఇబ్బందులే పడుతున్నారు. ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన అజీజ్ కరీంది కూడా ఇంచుమించు ఇలాంటి అనుభవమే.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







