వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌..

- November 16, 2016 , by Maagulf
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌..

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్‌ చేసింది. కృష్ణాజిల్లా మూలపాడులోని ఏసీఏ-కేడీసీఏ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో రాణించిన ఓపెనర్‌ స్మృతి మందన (5), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (15) విఫలమైనా.. వేదక కృష్ణమూర్తి (71 పరుగులు, 79 బంతులు, 10×4) సత్తా చాటడంతో భారత్‌ కుదురుకుంది. దీప్తి శర్మ (23), దేవిక వైద్య (32నాటౌట్‌)కూడాపర్వాలేదనిపించారు.అనంతరం రాజేశ్వరి గైక్వాడ్‌ (4/34) విజృంభించడంతో విండీస్‌ 49.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్‌ (44), నైట్‌ (55) రాణించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com