సుష్మాకు పెద్ద కష్టమే వచ్చింది....!
- November 17, 2016
కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్... కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు. మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతినడంతో ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఆమెకు పరీక్షలు జరుగుతున్నాయి. ముఖంపై ఎప్పుడూ చెదరని చిరునవ్వు... భారత సంస్కృతిని ప్రతిబింబించే చీరకట్టు సుష్మా స్వరాజ్ సొంతం. బీజేపీలోనే కాదు.. కేంద్ర మంత్రివర్గంలోను సుష్మా ఫైర్ బ్రాండ్. ట్విట్టర్లోను ఆమె చాలా యాక్టివ్. ప్రజా సమస్యలకు వెంటనే స్పందించడం ఆమె నైజం. ప్రస్తుతం సుష్మాకు పెద్ద కష్టమే వచ్చింది. ఆమె మూత్ర పిండాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నెల 7న ఎయిమ్స్ లో చేరిన సుష్మాకు డయాలసిస్ జరుగుతోంది. ఈ విషయం ఆమె స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం టెస్ట్లు చేయించుకుంటున్నానని, దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని అని సుష్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. మరోవైపు సుష్మా మూత్రపిండాల మార్పిడికి మరికొంత సమయం పడుతుందని, సరైన దాత కోసం అన్వేషిస్తున్నట్టు డాక్టర్లు చెప్పారు. అయితే కిడ్నీలు దానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇక సుష్మా త్వరగా కోలుకోవాలని పార్టీలకు అతీతంగా నేతలు ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆమె ఆరోగ్యం మెరుగవ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా , రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా, టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







