ఎమర్జన్సీ క్యాష్ ట్రాన్స్ఫర్కి కష్టాలు
- November 17, 2016
అబుధాబి: యూఏఈలోని భారతీయ వలసదారులు అత్యవసర పరిస్థితుల్లో తమవారికి డబ్బు పంపించడం చాలా కష్టమవుతోంది. భారతదేశంలోని కలెక్షన్ పాయింట్స్ వద్ద తగిన మొత్తంలో కరెన్సీ నోట్స్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో భారతదేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డబ్బులు పంపిస్తున్నా, అది సకాలంలో తమవారికి చేరడంలేదని బాధితులు వాపోతున్నారు. అబ్దుల్ కరీమ్ అనే వ్యక్తి 25,000 రూపాయల్ని ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించినా, అది చేరాల్సిన చోటుకి చేరలేదు. తన కుమార్తెకి డెలివరీ అయ్యిందనీ, అత్యవసర పరిస్థితుల్లో తాను ఆమె కోసం డబ్బు పంపించానని అబ్దుల్ కరీమ్ వాపోయారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే మొత్తానికి కూడా పరిమితి ఉండడంతో ఆసుపత్రిలో చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చిందని ఆయన అన్నారు. వినియోగదారుల సమస్యల పట్ల స్పందించిన ఎక్స్ప్రెస్ మనీ సీఓఓ సుదీష్ గిరియాన్, కొద్ది రోజుల్లో ఈ పరిస్థితి సద్దుమణుగుతుందనీ అప్పటివరకూ వినియోగదారుల సమస్యల పట్ల చింతిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









