సినిమాలు చేస్తూనే నిర్మాతగానూ కొనసాగాలని చరణ్ డిసైడ్...

- November 17, 2016 , by Maagulf
సినిమాలు చేస్తూనే  నిర్మాతగానూ కొనసాగాలని చరణ్ డిసైడ్...

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రాంచరణ్. ఇకపై కూడా ప్రొడ్యూసర్ గా కొనసాగాలని డిసైడ్ అయినట్టు సమాచారమ్. మెగా హీరోలతో కాకుండా బయటి హీరోలతోను చరణ్ సినిమాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.చరణ్-శర్వానంద్ లు బాల్య స్నేహితులు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడు చరణ్. దర్శకుడు ఎవరన్నది త్వరలోనే తేలనుంది. ఈ సినిమాతో పాటుగా అఖిల్ అక్కినేని సినిమాని కూడా చరణ్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం అఖిల్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది.ఈ చిత్రం తర్వాత అఖిల్ చేయబోయే చిత్రాన్ని చరణ్ నిర్మించనున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.మొత్తానికి.. ఇటు సినిమాలు చేస్తూనే, అటు నిర్మాతగానూ కొనసాగాలని చరణ్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. మరీ.. నిర్మాతగా చరణ్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com