హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..

- November 18, 2016 , by Maagulf
హీరోయిన్ సమంత నితిన్ రెస్టారెంట్ లాంఛ్ చేసింది..

లవర్ బోయ్ నితిన్, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన కలిసి స్టార్ట్ చేసిన టీ గ్రిల్ రెస్టారెంట్ ని ప్రముఖ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. సమంత ఈ లాంచింగ్ కార్యక్రమానికి హాజరు కానుందనే వార్త తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరకున్నారు. అయితే రెస్టారెంట్ లో భోజనం టేస్ట్ చూసిన సామ్ ఫుడ్ టేస్ట్ చాలా బాగుందని తెలిపింది. అంతే కాకుండా నితిన్, నీరజకి ఆల్ ది బెస్ట్ విషెస్ అందించింది. తనకు హైదరాబాద్ బిర్యానీ, మటన్ కీమా అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా తెలిపింది. మాదాపూర్ లోని కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న విశాలమైన ప్రాంతంలో టీ గ్రిల్ పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్ భోజన ప్రియులను ఎంతగానో అలరించనుందని నిర్వాహకులు చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com