దేశంలోని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికలు..
- November 19, 2016
దేశంలోని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో.. 9 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల దగ్గరకు చేరుకున్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే బైపోల్స్ పై పెద్ద నోట్లు రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. చిల్లర సమస్యలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురతోపాటూ పుదుచ్చేరిలో కూడా ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో మూడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే, డీఎంకే పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను 22న లెక్కిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







