త్వరలో మిషన్ సోషల్ మీడియా చేపడతాం - కమిషనర్ మహేందర్ రెడ్డి
- November 19, 2016మిషన్ చబుత్ర తరహాలో పాతబస్తీలో త్వరలో సోషల్ మీడియా మిషన్ చేపడతామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమయిన పోస్టింగ్లు పెట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టేవారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సాలార్జంగ్ మ్యూజియంలో శనివారం ముస్లిం మతపెద్దలతో సౌత జోన్ పోలీసులు సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య వివాదాలు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఫోస్టింగ్లు వస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయాలన్నారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఏసీపీకి లేదా డీసీపీ దృష్టికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పేట్లబురుజు సీఏఆర్ అడిషనల్ కమిషనర్ శివప్రసాద్, దక్షిణమండల డీసీపీ వి.సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ బాబురావు, ముస్లిం మత పెద్దలు మౌలానా ముఫ్తిఖలీల్ అహ్మద్, మౌలానా సయ్యద్ అలీ హుసేని, అలీ ముస్తఫా ఖాద్రి, అహ్మద్ హుసైన్ ఖాద్రి, హైదర్ ఆగా, ముర్తుజా పాషా, ఖుబుల్ పాషా శతారి, హాఫిజ్ ముజఫర్ హుసేన్ బందనవాజీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు