పట్టాలు తప్పిన పాట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్, 63 మంది మృతి
- November 19, 2016ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పాట్నా - ఇండోర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో 63 మందికి పైగా దుర్మరణం చెందారని తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. ప్రయాణీకులంతా గాఢనిద్రలో ఉండగా మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం తెలియడంతో అధికారులు సంఘటన స్థలం చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ల సహాయంతో బోగీలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. రైలు ప్రయాణించే మార్గంలోని ప్రధాన స్టేషన్లలో కాల్సెంటర్లు ఏర్పాటు చేశారు. మెడికల్ టీం కూడా సంఘటన స్థలానికి చేరుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
హెల్ప్లైన్ నెంబర్లు: ఝాన్సీ - 05101072, ఒరాయ్ - 051621072, కాన్పూర్ -05121072, పోక్రయాన్-05113-270239.
రైల్వేస్ అధికార ప్రతినిధి అనిల్ సక్సేనా మాట్లాడుతూ... మృతుల సంఖ్య గుర్తించవలసి ఉందని చెప్పారు. మెడికల్, రెస్క్యూ టీంలు సంఘటన స్థలానికి వెంటనే చేరుకున్నాయని చెప్పారు. 20 మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ.. ప్రమాదానికి బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదంలో పలువురి మృతి బాధించిందన్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్ని ఆసుపత్రులకు సహాయ సహకారాలపై ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటన నేపథ్యంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14