చైనా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్న పీవీ సింధు

- November 20, 2016 , by Maagulf
చైనా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్న పీవీ సింధు

తెలుగుతేజం.. ఒలింపిక్స్‌ రజత పతక విజేత వీపీ సింధు మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బాడ్మింటన్‌ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది. తుదిపోరులో తన కంటే ఒక ర్యాంకు(10) మెరుగైన చైనా క్రీడాకారిణి సన్‌ యూపై 21-11, 17-21, 21-11 తేడాతో సింధు సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలి రౌండ్‌ను సునాయాసంగా దక్కించుకున్న సింధుకు రెండో రౌండ్‌లో గట్టిపోటీ ఎదురైంది. దీంతో రెండో రౌండ్‌ను 17-21తేడాతో కోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడో రౌండ్‌లో సింధు అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. ఎదురుదాడి చేస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలో పడేసింది. ఈ క్రమంలో 21-11 తేడాతో మూడో రౌండ్‌ గెలుసుకుని.. టైటిల్‌ చేజిక్కించుకుంది. సింధుకు కెరీర్లో ఇదే తొలి సూపర్‌ సిరీస్‌ కావడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com