చైనా సూపర్ సిరీస్ ను కైవసం చేసుకున్న పీవీ సింధు
- November 20, 2016
తెలుగుతేజం.. ఒలింపిక్స్ రజత పతక విజేత వీపీ సింధు మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నీని సాధించి చరిత్ర సృష్టించింది. తుదిపోరులో తన కంటే ఒక ర్యాంకు(10) మెరుగైన చైనా క్రీడాకారిణి సన్ యూపై 21-11, 17-21, 21-11 తేడాతో సింధు సంచలన విజయం సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. తొలి రౌండ్ను సునాయాసంగా దక్కించుకున్న సింధుకు రెండో రౌండ్లో గట్టిపోటీ ఎదురైంది. దీంతో రెండో రౌండ్ను 17-21తేడాతో కోల్పోయింది. నిర్ణయాత్మకమైన మూడో రౌండ్లో సింధు అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. ఎదురుదాడి చేస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలో పడేసింది. ఈ క్రమంలో 21-11 తేడాతో మూడో రౌండ్ గెలుసుకుని.. టైటిల్ చేజిక్కించుకుంది. సింధుకు కెరీర్లో ఇదే తొలి సూపర్ సిరీస్ కావడం విశేషం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







