హీరోగా నటించనున్న అరవింద్ స్వామి
- November 20, 2016
తన రీ ఎంట్రీని ఘనంగా ప్రారంభించారు ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. 'కడల్', 'తని ఒరువన్'ల తర్వాత 'బోగన్'లో నటించారు. ప్రస్తుతం 'చదురంగ వేట్టై-2'లో త్రిషతో కలిసి తెరను పంచుకుంటున్నారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్య పాత్రల్లో కనిపించేందుకు అరవింద్ స్వామి ప్రయత్నించారు. ఇప్పుడు సెల్వ దర్శకత్వంలో హీరోగా కనిపించనున్నారట. క్రైం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే తలైవాసల్, అమరావతి, కర్ణా, నాన్ అవనిల్లై వంటి సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు సెల్వ.
ఈ చిత్రాన్ని 'నాన్ అవనిల్లై' బాణీలో అయిదుగురు హీరోయిన్లతో ఆయన రూపొందిస్తున్నారు. ఓ పాత్రకు ఇనియా ఇప్పటికే ఎంపికైంది. ఇతర పాత్రల కోసం మరికొందరితో చర్చలు కొనసాగుతున్నాయి. అయిదుగురు ముద్దుగుమ్మల్లో అరవింద్ స్వామికి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కథ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. కథ విన్న వెంటనే అరవింద్ స్వామి ఒప్పుకోవడం చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతోందని చెబుతున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









