హీరోగా నటించనున్న అరవింద్ స్వామి
- November 20, 2016
తన రీ ఎంట్రీని ఘనంగా ప్రారంభించారు ప్రముఖ నటుడు అరవింద్ స్వామి. 'కడల్', 'తని ఒరువన్'ల తర్వాత 'బోగన్'లో నటించారు. ప్రస్తుతం 'చదురంగ వేట్టై-2'లో త్రిషతో కలిసి తెరను పంచుకుంటున్నారు. ఈ చిత్రాలన్నింటిలోనూ వైవిధ్య పాత్రల్లో కనిపించేందుకు అరవింద్ స్వామి ప్రయత్నించారు. ఇప్పుడు సెల్వ దర్శకత్వంలో హీరోగా కనిపించనున్నారట. క్రైం కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబరు 16వ తేదీన చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్పటికే తలైవాసల్, అమరావతి, కర్ణా, నాన్ అవనిల్లై వంటి సుమారు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు సెల్వ.
ఈ చిత్రాన్ని 'నాన్ అవనిల్లై' బాణీలో అయిదుగురు హీరోయిన్లతో ఆయన రూపొందిస్తున్నారు. ఓ పాత్రకు ఇనియా ఇప్పటికే ఎంపికైంది. ఇతర పాత్రల కోసం మరికొందరితో చర్చలు కొనసాగుతున్నాయి. అయిదుగురు ముద్దుగుమ్మల్లో అరవింద్ స్వామికి జోడీగా ఎవరు నటిస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కథ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. కథ విన్న వెంటనే అరవింద్ స్వామి ఒప్పుకోవడం చూస్తేనే ఈ విషయం స్పష్టం అవుతోందని చెబుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







