కాబుల్ మసీదులో ఆత్మాహుతి దాడి, డజన్ పైగా మృతి
- November 21, 2016ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరో మారు రక్తసిక్తమైంది. ఓ షియా మసీదు వెలుపల ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బాంబు పేలుడుతో మసీదు పరిసర ప్రాంతం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయంతో పరుగులు తీశారు. మృతి చెందిన వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మసీదు రక్తసిక్తమైంది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్