రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి..!
- November 22, 2016
నల్లధనం, తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు పాత పెద్ద నోట్లు రద్దు చేశామన్న కేంద్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. మోదీ సర్కారు కొత్తగా చెలామణిలోకి తెచ్చిన రూ. 2000 నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జమ్మూకశ్మీర్ బందిపోరా జిల్లాలోని హంజన్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎదురు కాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు తీవ్రవాదులను హతమార్చాయి.ఘటనా స్థలం నుంచి రెండు ఏకే-47 తుపాకులు, తూటాలు, ఆయుధ సామాగ్రితో పాటు కొంత నగదును సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వంద రూపాయల నోట్లతో పాటు కొత్తగా చెలామణిలోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు ఉండటం చూసి సైనికులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఘటనా స్థలంలో దొరికిన రెండు రూ. 2 వేల నోట్లు అసలైనవా, నకిలీవా అనేది వెల్లడి కాలేదు. 14 రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చిన 2 వేల రూపాయల నోట్లు అప్పుడే తీవ్రవాదుల చేతుల్లోకి రావడం పట్ల సైనిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఈ నోట్లు తీవ్రవాదుల చేతుల్లోకి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత రూ. 500, రూ. వెయ్యి నకిలీ నోట్లు ముద్రించి సరిహద్దు గుండా మన దేశంలోని చొరబడుతున్న ఉగ్రవాదులకు రూ. 2 వేల నోటుతో కళ్లెం పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే తాజా ఉదంతంతో అంచనాలు తల్లకిందులయ్యాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









