ఫోర్జరీ: ఇద్దరు ట్రాఫిక్ పోలీస్మెన్కి జైలు
- November 22, 2016
మనామా: ఇద్దరు పోలీసులకు ఏడు మరియు ఐదేళ్ళ జైలు శిక్షను ఫోర్త్ సుప్రీమ్ క్రిమినల్ కోర్ట్ ఖరారు చేసింది. ట్రాఫిక్ యాక్సిడెంట్ రిపోర్టుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ల రిపోర్టుల్ని తారుమారు చేసి, ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బుల్ని రాబట్టిన కేసులో వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. మిగతా నలుగురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిథులకు అనుమానం వచ్చి, పోలీసులను ఆశ్రయించగా, విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో, ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. విచారణలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల్ని దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









