ఫోర్జరీ: ఇద్దరు ట్రాఫిక్ పోలీస్మెన్కి జైలు
- November 22, 2016
మనామా: ఇద్దరు పోలీసులకు ఏడు మరియు ఐదేళ్ళ జైలు శిక్షను ఫోర్త్ సుప్రీమ్ క్రిమినల్ కోర్ట్ ఖరారు చేసింది. ట్రాఫిక్ యాక్సిడెంట్ రిపోర్టుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్ యాక్సిడెంట్ల రిపోర్టుల్ని తారుమారు చేసి, ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బుల్ని రాబట్టిన కేసులో వీరిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు ఉన్నారు. మిగతా నలుగురికి పన్నెండేళ్ళ జైలు శిక్ష విధించారు. ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రతినిథులకు అనుమానం వచ్చి, పోలీసులను ఆశ్రయించగా, విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలింది. దాంతో, ఈ నేరానికి పాల్పడ్డ వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. విచారణలో ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల్ని దోషులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







