స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడికి ఒప్పందం

- November 22, 2016 , by Maagulf
స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడికి ఒప్పందం

నల్లధనంపై కేంద్ర ప్రభుత్వం పోరాటంలో మరో పెద్ద ముందడుగు పడింది. స్విట్జర్లాండ్‌తో సమాచార మార్పిడికి ఒప్పందం కుదిరింది. స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న భారతీయులకు సంబందించిన ఆర్థిక సమాచారం ఆటోమేటిక్‌గా 2019 సెప్టెంబర్‌ నుంచి భారత ప్రభుత్వానికి అందుతుంది. విదేశాల్లో పోగుపడుతున్న నల్లధనం పిశాచంతో పోరాడటానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. ఇరు దేశాల మధ్య ఆటోమేటిక్ సమాచార మార్పిడి అమలు కోసం ఉద్దేశించిన ఉమ్మడి ప్రకటనపై సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర, భారతదేశంలో స్విస్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ గిల్లీస్ రోడ్యుట్ మంగళవారం సంతకాలు చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com