విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల లో ప్రత్యేక దర్శనం...

- November 23, 2016 , by Maagulf
విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల లో ప్రత్యేక దర్శనం...

విదేశీ పర్యాటకులు, ప్రవాస భారతీయులు తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎంవోలో ఆ శాఖ అధికారులతో సీఎం బుధవారం మాట్లాడుతూ.. విదేశీయుల మనోభీష్టం మేరకు వెంకన్న దర్శనంలో సహకరించాలన్నారు. రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించిన తర్వాత రాష్ట్రంలో బౌద్ధ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారి కోసం బౌద్ధ స్థూపాలు, ఆరామాలు, చారిత్రక ప్రదేశాలతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. వచ్చే ఏడాది ఒడిసాలో టూర్‌ ఆపరేటర్స్‌ జాతీయ సదస్సు జరుగుతుందని, 2018లో మన రాష్ట్రంలో నిర్వహించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com