అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం : మోదీ
- November 24, 2016
అవినీతి, నల్లధనంపై ఉమ్మడి పోరాటం చేద్దామని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నల్లధనంపై సామాన్యుడూ సైనికుడిలా పోరాడాలన్నారు. పార్లమెంట్ భవన్లో శుక్రవారం జరిగిన 'న్యూ వెర్షన్ ఆఫ్ కానిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియా' పుస్తకావిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 'మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్' పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు ప్రత్యేక దినోత్సవం అవసరమని అభిప్రాయపడ్డారు. మన జీవితాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక స్థానముందని..రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటే అంబేడ్కర్ను స్మరించుకున్నట్లేనని చెప్పారు. ఆన్లైన్ సేవలని విస్తృతంగా వినియోగించుకోవాలని చెప్పారు. వ్యాపార లావాదేవీలన్నీ మొబైల్ ఫోన్తోనే చక్కబెట్టుకోవచ్చని చెప్పారు. డిజిటల్ కరెన్సీని విరివిగా వాడుకోవాలన్నారు.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ వైపు పయనిద్దామన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







