పంజాబ్‌లోని బఠిండాలో ఎయిమ్స్‌ భవనానికి ప్రధాని శంకుస్థాపన

- November 25, 2016 , by Maagulf
పంజాబ్‌లోని బఠిండాలో ఎయిమ్స్‌ భవనానికి ప్రధాని శంకుస్థాపన

పంజాబ్‌లోని బఠిండాలో ఎయిమ్స్‌ భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల వికాసం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్న ప్రధాని.. రహదారులు, విమానాశ్రయాలు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యున్నత ప్రమాణాలు గల పాఠశాలలు ఆస్పత్రులు మనకు అవసరమని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాదని.. తలపెట్టిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చెప్పారు. ఏ దైశమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతులు కల్పనే ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా లక్షితదాడుల్లో భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు.పాకిస్థాన్‌లోని పెషావర్‌లో దాడి జరిగితే భారతీయులంతా బాధ పడతారని చెప్పారు. అవినీతి, నకిలీనోట్లుపై పోరాడాలని ప్రజలు వారి పాలకులకు చెప్పాలని పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com