పెట్టుబడుల నిమిత్తం గల్ఫ్ వెళ్లనున్న చంద్రబాబు
- November 25, 2016
నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆహ్వనించడం కొరకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు గల్ఫ్ దేశాలలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలను శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర సలహాదారు డాక్టర్ వేమూరి రవి కుమార్ కువైట్ లోని ఎపి ఎన్నార్టీ కో ఆర్డినేటర్లతో టెలికాన్ఫరెన్స్లో వెల్లడించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వచ్చె నెల 11,12,13 తేదిలలో చంద్రబాబు నాయుడు దుబాయ్, ఆబుధాబి మరియు కువైట్లలో పర్యటించనున్నారు, ఈ మూడు నగరాలలో కూడ చంద్రబాబు నాయుడు ఆయన వెంట రానున్న ఉన్నత స్ధాయి అధికారిక బృందం గల్ఫ్ అరబ్బు వ్యాపారవేత్తలతో సమావేశం జరపనుంది. ఈ మూడు చోట్లకు చెందిన స్ధానిక ప్రవాస మరియు కొందరు అరబ్బు వ్యాపారవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి గత కొంత కాలంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
తన పర్యటన సందర్భంగా అల్ ముక్తుమ్, అల్ నహ్యాన్ మరియు అల్ సభా మూడు రాజ కుటుంబీకుల ప్రతినిధులతో కూడ సమావేశం కావడానికి ముఖ్యమంత్రి ఆసక్తి ప్రదర్శిస్తున్నట్లుగా సమాచారం.తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్రుల సంక్షేమానికి సంబంధించి తమ ప్రభుత్వం తీసుకోనున్న కొన్ని ముఖ్య ప్రకటనలు కూడ చేస్తారని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు పార్టీ అభిమానులు నిర్వహించె కొన్ని కార్యక్రమాలలో కూడ పాల్గోంటారని సమాచారం. ముఖ్యమంత్రి రాక కొరకు అక్కడి తెలుగు ప్రజలు అతృతతో ఎదురు చూస్తున్నారు.కాని ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏలాంటి వివరాలను వెల్లడించడానికి సంబంధిత వర్గాలు ఇష్టపడడం లేదు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









