ఇరాన్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం...

- November 25, 2016 , by Maagulf
ఇరాన్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్స్‌లో  ఘోర రైలు ప్రమాదం...

ఇరాన్‌లోని సెమ్నాన్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఎదురెదురుగా ఢకొీనడంతో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. దాంతో రెండు బోగీల్లో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు, సహాయ సిబ్బంది క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రులకి చికిత్స నిమిత్తం తరలించారు. ఎదురుగా వస్తున్న ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పి పక్కన పట్టాలపైన ఆగివున్న మరో ప్యాసింజర్‌ రైలును ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రతినిధులు తెలిపారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com