హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని పర్యటన

- November 26, 2016 , by Maagulf
హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరబాద్‌ పర్యటన ముగిసింది. రెండు రోజుల పాటు భాగ్యనగరంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న మోదీ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన జాతీయస్థాయి డీజీపీల సదస్సులో పాల్గొన్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన ప్రవేశద్వారాల వద్ద రాష్ట్ర పోలీసులతోపాటు ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీ బయల్దేరారు. ప్రధానికి గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌ వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com