హాంకాంగ్ ఫైనల్కు 'సింధు'
- November 26, 2016
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతోంది. చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ టైటిల్ కైవసం చేసుకొన్న వారం రోజుల్లోపే రెండో సూపర్ సిరీస్ ఫైనల్కు చేరి చరిత్ర సృష్టించింది. హాంకాంగ్ సూపర్ సిరీస్లో భాగంగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఈ ఒలింపిక్ రజత పతక విజేత.. ప్రత్యర్థి క్రీడాకారిణి, స్థానిక ఫేవరెట్ చెంగ్ నగన్ యిని 21-14, 21-16తో చిత్తు చేసింది. .
దూకుడు మంత్రం
సెమీస్లో సింధు అత్యంత దూకుడుగా ఆడింది.
రెండు గేములను అనాయాసంగా కైవసం చేసుకొంది. స్కోర్ 2-2తో ఉండగా చెంగ్ 5-4తో ముందుకెళ్లింది. వెంటనే పుంజుకొన్న సింధు 11-9తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15-11తో మరింత ముందుకెళ్లి 21-14తో తొలిగేమ్ గెలుచుకొంది.
రెండో గేమ్లో చెంగ్ ప్రతిఘటించడంతో సింధు 11-10తో స్వల్ప ఆధిక్యం సాధించింది. వెంటనే 15-12తో దూసుకుపోయింది. 17-14 నుంచి 21-16తో రెండో గేమ్ కైవసం చేసుకొని ఫైనల్లో అడుగు పెట్టింది. టైటిల్ పోరులో సింధు..
తైజు ఇంగ్తో తలపడనుంది. మహిళలు, పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారతీయులు తలపడుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







