హాంకాంగ్‌ ఫైనల్‌కు 'సింధు'

- November 26, 2016 , by Maagulf
హాంకాంగ్‌ ఫైనల్‌కు 'సింధు'

భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు తన అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతోంది. చైనా సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టైటిల్‌ కైవసం చేసుకొన్న వారం రోజుల్లోపే రెండో సూపర్‌ సిరీస్‌ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. హాంకాంగ్‌ సూపర్‌ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఈ ఒలింపిక్‌ రజత పతక విజేత.. ప్రత్యర్థి క్రీడాకారిణి, స్థానిక ఫేవరెట్‌ చెంగ్‌ నగన్‌ యిని 21-14, 21-16తో చిత్తు చేసింది. .
దూకుడు మంత్రం 
సెమీస్‌లో సింధు అత్యంత దూకుడుగా ఆడింది.

రెండు గేములను అనాయాసంగా కైవసం చేసుకొంది. స్కోర్‌ 2-2తో ఉండగా చెంగ్‌ 5-4తో ముందుకెళ్లింది. వెంటనే పుంజుకొన్న సింధు 11-9తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15-11తో మరింత ముందుకెళ్లి 21-14తో తొలిగేమ్‌ గెలుచుకొంది.

రెండో గేమ్‌లో చెంగ్‌ ప్రతిఘటించడంతో సింధు 11-10తో స్వల్ప ఆధిక్యం సాధించింది. వెంటనే 15-12తో దూసుకుపోయింది. 17-14 నుంచి 21-16తో రెండో గేమ్‌ కైవసం చేసుకొని ఫైనల్లో అడుగు పెట్టింది. టైటిల్‌ పోరులో సింధు..

తైజు ఇంగ్‌తో తలపడనుంది. మహిళలు, పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో భారతీయులు తలపడుతుండటం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com