ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణ...

- November 27, 2016 , by Maagulf
ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణ...

ఉగాండాలో భద్రతాదళాలు, వేర్పాటువాద పౌరసైన్యం మధ్య తలెత్తిన ఘర్షణల్లో 55 మంది మృత్యువాతపడ్డారు. పశ్చిమ ఉగాండాలోని కసెసె పట్టణంలో శనివారం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. గస్తీ తిరుగుతున్న భద్రతా బలగాలపై ర్వెంజురురు అనే గిరిజన రాజ్య పౌరసైన్యం తొలుత దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం అన్ని ఉప కౌంటీల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనల్లో 14 మంది పోలీసులు, 41 మంది పౌరసైన్యం సిబ్బంది మృతి చెందారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com