రోడ్లను బాగుచేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మినిస్ట్రీ
- November 28, 2016
మనామా: భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మినిస్ట్రీ 24 గంటలూ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. ముహర్రాక్ మునిసిపాలిటీ, ముంపు ప్రాంతాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో సహాయక కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. రోడ్లను పొడిగా ఉంచేందుకు, అలాగే క్లీన్గా మార్చేందుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ప్రతి కంప్లయింట్నీ సునిశితంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు వారు వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మునిసిపాలిటీ 174 నోటిఫికేషన్లను అందుకుంది. ప్రధానంగా ముహర్రాక్ గవర్నరేట్ పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా కూడా సహాయక చర్యల్ని చేపట్టారు అధికారులు. ట్విట్టర్, ఇన్స్టగ్రామ్లో ముహర్రాక్ మునిగిపోతోంది అనే పేరుతో కామెంట్స్, పోస్టింగ్స్ ట్రెండింగ్గా మారాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







