త్వరలో ముల్తిపుల్ ఎంట్రీ వీసాలు జారీ చేయనున్న భారతీయ రాయబార కార్యాలయం

- November 28, 2016 , by Maagulf
త్వరలో ముల్తిపుల్ ఎంట్రీ వీసాలు జారీ చేయనున్న భారతీయ రాయబార కార్యాలయం

దోహా: సందర్శకులు,వ్యాపారవేత్తలు సులభతరంగా సందర్శించడానికి భారతీయ రాయబార కార్యాలయం ఆరునెలల కాలం లేదా ఆపైన మరింత కాలం ఒక ప్రామాణికత బహుళ-ప్రవేశ వీసాల జారీ ప్రక్రియ  ప్రారంభించడానికి అవకాశం ఉంది.ప్రస్తుతం భారత రాయబార కార్యానయం మూడు నెలల వ్యవధితో ఒకే ప్రవేశ వీసా జారీ చేస్తుంది. కతర్ లో భారతదేశం యొక్క రాయబారి  పి కుమరన్ మాట్లాడుతూ, కొత్త ప్రణాళికని రూపొందించేందుకు యంత్రా0గం పనిచేస్తున్నానట్లు తెలిపారు. బహుళ ఎంట్రీ వీసాలను  మంజూరు చేయడం ద్వారా ప్రజలకు  సులభతరం కానున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు నెలల సమయం ఉన్న వీసాలు కూడా ఆరు నెలల సమయం లేదా అంతకు పైగా  చెల్లుబాటు సమయం పెంచవచ్చని ఆయన అన్నారు. ఇది  "చాలా వరకు"  ప్రతిపాదన గానే ఉందని,తాను న్యూఢిల్లీకి తదుపరి సందర్శన సమయంలోఈ యోచనకు తుది ఆకారం దాల్చుతుందని అన్నారు. కతర్ లో మూడు కొత్త కాన్సులర్ సేవా కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా కుమరన్ తెలిపారు.అవి అల్ హిలాల్, సల్వా ఇండస్ట్రియల్ ఏరియా మరియు అల్ ఖోర్ ప్రాంతాలలోతెరువబడినట్లు ఆయన చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com