జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకం
- November 28, 2016
జెట్ ఎయిర్వేస్ సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. దేశీయంగా తను విమానసర్వీసులు నడిపే మార్గాల్లో ఒక వైపు ప్రయాణాన్ని రూ.899 (పన్నులతో కలిపి) ప్రారంభ ధరకే అందిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 2 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఎకానమీ క్లాసుకు అది కూడా ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ప్రయాణ తేదీకి 15 రోజుల పోస్ట్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. గడువు లోపు ఎవరైతే ముందు బుక్ చేసుకుంటారో వారే ఈ పథకానికి అర్హులవుతారని జెట్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేయదలిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







