జెట్‌ ఎయిర్‌వేస్‌ సరికొత్త పథకం

- November 28, 2016 , by Maagulf
జెట్‌ ఎయిర్‌వేస్‌ సరికొత్త పథకం

జెట్‌ ఎయిర్‌వేస్‌ సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. దేశీయంగా తను విమానసర్వీసులు నడిపే మార్గాల్లో ఒక వైపు ప్రయాణాన్ని రూ.899 (పన్నులతో కలిపి) ప్రారంభ ధరకే అందిస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచి టికెట్‌ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబరు 2 వరకు అమ్మకాలు కొనసాగుతాయి. ఎకానమీ క్లాసుకు అది కూడా ఎంపిక చేసిన మార్గాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అలాగే ప్రయాణ తేదీకి 15 రోజుల పోస్ట్‌ బుకింగ్‌ వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది. గడువు లోపు ఎవరైతే ముందు బుక్‌ చేసుకుంటారో వారే ఈ పథకానికి అర్హులవుతారని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.అలాగే ప్రయాణ ప్రణాళికలో మార్పులు చేయదలిస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com