పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్మాల్పై సీబీఐ ఫోకస్...
- November 28, 2016
పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్మాల్పై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన ఆధారాలను సేకరించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. హిమాయత్ నగర్ పోస్టాఫీస్ సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సూపరెంటిండెంట్ సుధీర్బాబు, పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజలపై కేసులు నమోదయ్యాయి. త్వరలోనే వీరిని అరెస్ట్ చేసే అవకాశముంది.నోట్ల మార్పిడి ఆరోపణలు రావడంతో హైదరాబాద్లోని పోస్టాఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హిమాయత్నగర్, అబిడ్స్తో పాటు మరికొన్ని చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించి... కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. పోస్టాఫీస్ సిబ్బంది కొంతమంది నల్ల కుబేరులతో కుమ్మక్కై భారీగా డబ్బును మార్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలపై సీబీఐ పరిశీలించింది.
హిమాయత్నగర్లోని పోస్టాఫీసులో 40 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 30 శాతం కమీషన్తో డబ్బు మార్చినట్లు సీబీఐ తనిఖీల్లో బయటపడినట్లు తెలుస్తోంది. చాలా పోస్టాఫీసుల్లో సిబ్బంది వేరే మార్గంలో తమకు అవసరమైన వారికి డబ్బు మార్పిడి చేస్తున్న విషయం బయటపడింది. అబిడ్స్ పోస్టాఫీసులోనూ నో క్యాష్ బోర్డును గుర్తించారు. సీబీఐ తనిఖీలతో సిబ్బంది ఈ బోర్డును తీసే ప్రయత్నం చేశారు. అక్రమ నగదు మార్పిడి విషయంలో పర్సెంటేజీపై సిబ్బంది మధ్య విభేదాల వల్లే విషయం బయటకు పొక్కినట్లు సమాచారం.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









