పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్మాల్పై సీబీఐ ఫోకస్...
- November 28, 2016
పోస్టాఫీసుల్లో జరిగిన నోట్ల మార్పిడి గోల్మాల్పై సీబీఐ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్లో సోదాలు నిర్వహించిన ఆధారాలను సేకరించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సీబీఐ వరుసగా కేసులు నమోదు చేస్తోంది. హిమాయత్ నగర్ పోస్టాఫీస్ సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. సూపరెంటిండెంట్ సుధీర్బాబు, పోస్ట్ మాస్టర్ రేవతి, డిప్యూటీ పోస్ట్ మాస్టర్ రవితేజలపై కేసులు నమోదయ్యాయి. త్వరలోనే వీరిని అరెస్ట్ చేసే అవకాశముంది.నోట్ల మార్పిడి ఆరోపణలు రావడంతో హైదరాబాద్లోని పోస్టాఫీసుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హిమాయత్నగర్, అబిడ్స్తో పాటు మరికొన్ని చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించి... కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొన్నారు. పోస్టాఫీస్ సిబ్బంది కొంతమంది నల్ల కుబేరులతో కుమ్మక్కై భారీగా డబ్బును మార్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 8 నుంచి జరిగిన లావాదేవీలపై సీబీఐ పరిశీలించింది.
హిమాయత్నగర్లోని పోస్టాఫీసులో 40 లక్షల వరకు అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. 30 శాతం కమీషన్తో డబ్బు మార్చినట్లు సీబీఐ తనిఖీల్లో బయటపడినట్లు తెలుస్తోంది. చాలా పోస్టాఫీసుల్లో సిబ్బంది వేరే మార్గంలో తమకు అవసరమైన వారికి డబ్బు మార్పిడి చేస్తున్న విషయం బయటపడింది. అబిడ్స్ పోస్టాఫీసులోనూ నో క్యాష్ బోర్డును గుర్తించారు. సీబీఐ తనిఖీలతో సిబ్బంది ఈ బోర్డును తీసే ప్రయత్నం చేశారు. అక్రమ నగదు మార్పిడి విషయంలో పర్సెంటేజీపై సిబ్బంది మధ్య విభేదాల వల్లే విషయం బయటకు పొక్కినట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







