బహిరంగంగా మద్యం తాగేవారిపై కఠిన చర్యలు..
- November 28, 2016
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బహిరంగంగా మద్యం తాగితే భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖామంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. నవంబరు 7వతేదీ నుంచి మూడు వారాల్లో 360 మంది బహిరంగంగా మద్యం తాగడంతో పాటు న్యూసెన్స్ సృష్టించిన 360 మందిని అరెస్టు చేశామని సిసోడియా పేర్కొన్నారు.
ఎక్సైజ్ యాక్టు సెక్షన్ 40 కింద మందుబాబులపై మూడంచెల విధానంలో చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. మొదటి విడతగా వీధుల్లో బహిరంగంగా మద్యం తాగడాన్ని నివారించాలని కోరుతూ ప్రచారం చేపడతామన్నారు. అనంతరం వీధుల్లో మద్యం తాగిన వారికి ఐదువేల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. మద్యం తాగి వీధుల్లో అల్లరి చేసిన వారిపై పదివేల జరిమానా విధిస్తామన్నారు.ఢిల్లీలో మహిళల భద్రత కోసం బహిరంగంగా మద్యం తాగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సిసోడియా వివరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







