బహిరంగంగా మద్యం తాగేవారిపై కఠిన చర్యలు..
- November 28, 2016
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బహిరంగంగా మద్యం తాగితే భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖామంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. నవంబరు 7వతేదీ నుంచి మూడు వారాల్లో 360 మంది బహిరంగంగా మద్యం తాగడంతో పాటు న్యూసెన్స్ సృష్టించిన 360 మందిని అరెస్టు చేశామని సిసోడియా పేర్కొన్నారు.
ఎక్సైజ్ యాక్టు సెక్షన్ 40 కింద మందుబాబులపై మూడంచెల విధానంలో చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. మొదటి విడతగా వీధుల్లో బహిరంగంగా మద్యం తాగడాన్ని నివారించాలని కోరుతూ ప్రచారం చేపడతామన్నారు. అనంతరం వీధుల్లో మద్యం తాగిన వారికి ఐదువేల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. మద్యం తాగి వీధుల్లో అల్లరి చేసిన వారిపై పదివేల జరిమానా విధిస్తామన్నారు.ఢిల్లీలో మహిళల భద్రత కోసం బహిరంగంగా మద్యం తాగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సిసోడియా వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









