వజీరాలాంగ్కార్న్ కి రాజు పదవి చేపట్టమని ఆహ్వానం...
- November 29, 2016
తీవ్ర అనారోగ్యం కారణంగా థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ అక్టోబరు 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాలించిన ఆయన మరణంతో ప్రజలు తీవ్ర విషాదంలో మునిగిపోగా అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు థాయిలాండ్కు తదుపరి రాజును ఎంపిక చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. ప్రస్తుతం యువరాజుగా ఉన్న మహా వజిరాలాంగ్కోర్న్ను థాయిలాండ్ రాజుగా పదవి చేపట్టమని మంగళవారం అక్కడి పార్లమెంట్ ఆహ్వానించింది.
ఆ దేశ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పార్న్పెచ్ విచిత్చోల్చాయ్ ఆనవాయితీ ప్రకారం యువరాజును ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.వెంటనే పార్లమెంటు సభ్యులంతా నిలబడి 'లాంగ్లివ్ ద కింగ్' అంటూ నినదించారు. ఈరోజు ఉదయం ముందుగా కేబినెట్ యువరాజు పేరును ప్రతిపాదించింది. డిప్యూటీ ప్రధాన మంత్రి ప్రావిత్ వాంగ్సువాన్ కొత్త రాజు బాధ్యతలు స్వీకరించేందుకు అవసరమైన ప్రక్రియ సంప్రదాయ నియమాల ప్రకారం అంచెలంచెలుగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పుడిక ప్రొటోకాల్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ యువరాజుతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో యువరాజును రాజుగా అధికారికంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు సమాచారం. జర్మనీలో వీరి కుటుంబానికి ఆస్తులు ఉన్నాయి. దాంతో సంవత్సరంలో ఎక్కువ కాలం ఆయన అక్కడే గడుపుతుంటారు.సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన రెండో రాజుగా థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యదేజ్ నిలిచారు. అనారోగ్యం కారణంగా ఆయన అక్టోబర్ 13న కన్నుమూశారు. కుమారుడు 64 ఏళ్ల వజీరాలాంగ్కార్న్ని తన వారసుడిగా భూమిబోల్ నాలుగు దశాబ్దాల క్రితమే ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







