బహ్రెయిన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే
- November 29, 2016
ఇండియన్ ఎంబజీ నేతృత్వంలో ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించింది. మొత్తం 8 ఇండియన్ స్కూల్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఛైర్మన్ షకిల్ అహ్మద్ అజ్మి, అతిథుల్ని ఆహ్వానించగా, ప్రిన్సిపల్ మొహమ్మద్ తయ్యబ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్, ఇండియన్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించీ, ఇండియన్ డెమొక్రసీ గురించీ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. ఇటీవల సిబిఎస్ఇ, అన్ని స్కూళ్ళూ ఇండియన్ కానిస్టిట్యూషన్ డే సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాస్ రీడింగ్ చేపట్టాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!









