నోట్ల రద్దుపై ఎన్ఆర్ఐలకు ఎస్బిఐ ఉన్నతాధికారుల సమాధానాలు
- November 29, 2016
మస్కట్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఉన్నతాధికారులు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ పరిస్థితులపై ఎన్ఆర్ఐల అనుమానాల్ని నివృత్తి చేయనున్నారు. గురువారం ఈ మేరకు మీటింగ్ జరగనుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎన్ఆర్ఐలు తమ వెంట పాత రద్దు చేయబడిన కరెన్సీని తీసుకెళ్ళడం ఇబ్బందికరంగా మారింది. అలాగే మనీ ఎక్స్ఛేంజ్లోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటర్ కాంటినెంటల్ మస్కట్లో సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ఈ సమావేశం జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ మేనేజింగ్ డైరెక్టర్ సిఆర్శశి కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ, ఎన్ఆర్ఐ సర్వీసెస్ - ఎస్బి - ముంబై జనరల్ మేనేజర్ పికె మిశ్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని గ్లోబల్ మనీ ఎక్స్ఛేంజ్ జనరల్ డైరెక్టర్ మధుసూదన్ చెప్పారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







