బహ్రెయిన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే
- November 29, 2016
ఇండియన్ ఎంబజీ నేతృత్వంలో ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించింది. మొత్తం 8 ఇండియన్ స్కూల్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఇండియన్ అంబాసిడర్ అలోక్ కుమార్ సిన్హా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐబిఎన్ అల్ హైతమ్ ఇస్లామిక్ స్కూల్, అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుంది. అడ్మినిస్ట్రేటివ్ కమిటీ ఛైర్మన్ షకిల్ అహ్మద్ అజ్మి, అతిథుల్ని ఆహ్వానించగా, ప్రిన్సిపల్ మొహమ్మద్ తయ్యబ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పారు. ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ ఆనంద్ ప్రకాష్, ఇండియన్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత రాజ్యాంగం గురించీ, ఇండియన్ డెమొక్రసీ గురించీ విద్యార్థుల్లో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యమని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు పేర్కొన్నారు. ఇటీవల సిబిఎస్ఇ, అన్ని స్కూళ్ళూ ఇండియన్ కానిస్టిట్యూషన్ డే సందర్భంగా నవంబర్ 26వ తేదీన మాస్ రీడింగ్ చేపట్టాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







