నకిలీ పత్రం సమర్పించినందకు ఒక సంస్థను మూసివేయించిన మంత్రిత్వశాఖ

- November 29, 2016 , by Maagulf
నకిలీ పత్రం సమర్పించినందకు ఒక సంస్థను మూసివేయించిన మంత్రిత్వశాఖ

మనామా: ఇటీవల ఒక నకిలీ పత్రం సమర్పించినందుకు ఒక సంస్థను మూసివేసినట్లు కంపెనీలు వ్యవహారాల డైరెక్టరేట్ పరిశ్రమ,వాణిజ్యం మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు బాధ్యత వహించిన ఆ సంస్థకు సంబంధించిన వారిని ప్రశ్నించే నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుట ఉంచినట్లు సంబంధిత శాఖ పేర్కొంది. ఆ కంపెనీ సమర్పించిన అధికారిక పత్రం ఒక ఎలక్ట్రానిక్ కాపీ కావడంతో డైరెక్టరేట్ యొక్క నిపుణులు అనుమానించారు  మంత్రిత్వశాఖ ఆ కంపెనీ పేరు తెలియచేయకుండా ఒక ప్రకటనలో తెలిపింది అభ్యర్థనల వర్తించే సమయంలో ఏ నకిలీ పత్రాలైన ఉపయోగించినట్లయితే చర్య తీవ్రంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ హెచ్చరించారు. ఈ తరహా మోసపూరిత పత్రాలను సృష్టించడం సహించబోమని అందుకు ప్రతిగా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. వాటిని ఉల్లంఘించినవారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com