ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్‌ జాబితాలో నలుగురు భారతీయులు

- November 30, 2016 , by Maagulf
ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్‌ జాబితాలో నలుగురు భారతీయులు

ప్రతిష్ఠాత్మక ఫార్చ్యూన్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ జాబితాలో నలుగురు భారత సంతతి సీఈవోలు చోటు దక్కించుకొన్నారు. ఫేస్‌బుక్‌ సీఈవో జూకర్‌బర్గ్‌ అగ్రస్థానంలో వున్న 50 మంది వ్యాపారాధిపతుల జాబితాలో తెలుగువ్యక్తి, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల -5, మిల్వాకీకి చెందిన వాటర్‌ హీటర్స్‌ సంస్థ ఏబీ స్మిత్‌ సీఈవో అజిత రాజేంద్ర -34, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎండీ ఆదిత్య పూరి -34, మాస్టర్‌కార్డ్‌ సీఈవో అజయ్‌పాల్‌సింగ్‌ బంగా -40వ స్థానాల్లో నిలిచారు.మైక్రోసాఫ్ట్‌ పగ్గాల్ని 2014లో చేపట్టిన సత్యనాదెళ్ల సంస్థను వృద్ధివైపు పరుగులు పెట్టిస్తున్నాడని ఫార్చ్యూన్‌ ప్రశంసించింది.
ప్రముఖులు- స్థానాలు 
* అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌ -2 
* ఆల్ఫాబెట్‌ సీఈవో లారీ పేజ్‌ -4 
* అలీబాబా ఎక్సిక్యూటివ్‌ ఛైర్మన్‌ జాక్‌మా -10 
* యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ -11 
* ఉబెర్‌ సీఈవో ట్రావిస్‌ కలానిక్‌ -15 
* స్టార్‌బక్స్‌ సీఈవో హొవార్డ్‌ -29

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com