మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఎగ్జిట్ రూల్స్ సరళతరం
- December 01, 2016
2015 డిసెంబర్ 13 కొత్త చట్టం 21 అమల్లోకి రావడం ద్వారా ఖతార్లో 2.1 మిలియన్ సేలరీడ్ వర్క్ ఫోర్స్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయని అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. కొత్త విధానం, అప్పటిదాకా అమల్లో ఉన్న ఖఫాలా సిస్టమ్ని రీప్లేస్ చేసింది. అధునాతనమైన కాంట్రాక్ట్ బేస్డ్ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం ప్రకారం విదేశీ వర్కర్స్, దేశాన్ని విడిచిపెట్టేందుకుగాను యజమానికి సమాచారం అందిస్తే సరిపోతుంది. కాంట్రాక్ట్ ముగసిన తర్వాత లేదా కాంట్రాక్ట్ ఉండగానే పర్మనెంట్గా దేశం విడిచిపోవడానికి కార్మికులకు వెసులుబాటు కలిగింది. ఒకవేళ యజమాని తిరస్కరిస్తే, మైగ్రెంట్ వర్కర్ తన ఎగ్జిట్ పర్మిట్ కోసం గ్రీవెన్సెస్ కమిటీని సంప్రదించవచ్చు. మూడు రోజుల్లోపే ఆ కమిటీ వర్కర్ ఫిర్యాదుపై స్పందిస్తుంది. ఈ మూడు రోజుల్లో ఆ వర్కర్ ఏమైనా నేరాలకు పాల్పడ్డాడా? అనే అంశాలపై కమిటీ పరిశీలిస్తుంది. అవేమీ లేవని తేలితే, ఎగ్జిట్ పర్మిట్ లభిస్తుంది. ఎగ్జిట్ పర్మిట్ గ్రీవెన్సెస్ కమిటీలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్, అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు ఉంటారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







