యూఏఈ అమరవీరులకు పర్మనెంట్ మెమోరియల్
- December 01, 2016
అబుదాబీ: దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకునేందుకు, వారిని గౌరవించుకునేందుకోసం ప్రత్యేకంగా వహత్ అల్ కరామా (ఒయాసిస్ ఆఫ్ డిగ్నిటీ) మెమోరియల్ సైట్ని అబుదాబీలో కమ్మెమరేషన్ డే సందర్భంగా ప్రారంభించారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ గత ఏడాది ఈ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిర్మాణం ఈ ఏడాది మార్చ్లో ప్రారంభమయ్యింది. షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సమీపంలో దీన్ని నిర్మించారు. ఇది దేశంలో కల్చరల్ ల్యాండ్ మార్క్గా ప్రసిద్ధిగాంచనుంది. 42,000 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ మెమోరియల్ సైట్ పెవిలియన్, హానర్ మరియు మొమోరియల్ మాన్యుమెంట్ని కలిగి ఉంటుంది. పెవిలియన్ ఆఫ్ హానర్లో 196 మంది ఎమిరేటీ అమరవీరులకు సంబంధించిన పేర్లను, వారి వివరాలను గోడలపై పొందుపరిచారు. పెవిలియన్ రూఫ్ ఎనిమిది ప్యానల్స్తో రూపొందించారు. మెమోరియల్ మాన్యుమెంట్ని బ్రిటిష్ ఆర్టిస్ట్ ఇద్రిస్ ఖాన్ డిజైన్ చేశారు. యూఏఈ భావజాలాన్ని ఇక్కడ పొందుపరిచారు. మెమోరియల్ ప్లాజా అతి విశాలమైన ప్రాంతం. ఇక్కడే కమ్మెమరేషన్ డే జరుగుతుంది.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







