సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'
- December 01, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు. పాత తరంలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు ఓ వైపు హీరో గా నటిస్తూనే..మరోవైపు కమెడియన్లు గా నటించారు. ఇక బ్రహ్మానందం, ఆలీ లాంటి వారు కూడా హీరోలుగా వచ్చి కమెడియన్లుగా రాణించారు. తాజాగా గత మూడు సంవత్సరాల నుంచి మంచి కమెడియన్ గా రాణించి తాజాగా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రంతో హీరోగా వస్తున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఆ మద్య ఈ చిత్రం ఆడియో రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా జరిగింది. సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'యు/ఏ' రేటింగ్ తో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరి మనసుకి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో సప్తగిరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









