సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న 'సప్తగిరి ఎక్స్ ప్రెస్'
- December 01, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు హీరోలుగా వచ్చారు. పాత తరంలో రాజబాబు, పద్మనాభం, చలం లాంటి వారు ఓ వైపు హీరో గా నటిస్తూనే..మరోవైపు కమెడియన్లు గా నటించారు. ఇక బ్రహ్మానందం, ఆలీ లాంటి వారు కూడా హీరోలుగా వచ్చి కమెడియన్లుగా రాణించారు. తాజాగా గత మూడు సంవత్సరాల నుంచి మంచి కమెడియన్ గా రాణించి తాజాగా 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' చిత్రంతో హీరోగా వస్తున్నాడు. త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పావర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఆ మద్య ఈ చిత్రం ఆడియో రిలీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చేతుల మీదుగా జరిగింది. సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'యు/ఏ' రేటింగ్ తో 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్ తెలిపారు. కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరి మనసుకి నచ్చుతుందని చిత్ర యూనిట్ నమ్ముతున్నారు. మరి ఈ సినిమాతో సప్తగిరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







