పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన 'కమ్యునిస్ట్'లు
- December 01, 2016
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్తో సీపీఐ నేతలు భేటీ కావడం ఆసక్తిగా వుంది. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రావు తదితరులు కొద్దిసేపటి క్రితం పవన్తో భేటీ అయ్యారు. తాజగా రాజకీయ పరిణామాలు, ఎపీకి స్పెషల్ స్టేటస్, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటివలే పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ముగిసిపోయిన కధ చెబుతున్న కేంద్రాన్ని తగిన బుద్ది ప్రజలు చెబుతారని హెచ్చరించారు పవన్. అలాగే, మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పై కూడా ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకొని గంధర గోళం చేశారని అభిప్రాయపడ్డారు పవన్. ఈ ఇలాంటి నేపధ్యంలో ఆయన సీపీఐ నేతలతో భేటీ కావడం ఒక్కింత ఆసక్తిగా మారింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







