పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన 'కమ్యునిస్ట్'లు

- December 01, 2016 , by Maagulf
పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన 'కమ్యునిస్ట్'లు

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌తో సీపీఐ నేతలు భేటీ కావడం ఆసక్తిగా వుంది. సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రావు తదితరులు కొద్దిసేపటి క్రితం పవన్‌తో భేటీ అయ్యారు. తాజగా రాజకీయ పరిణామాలు, ఎపీకి స్పెషల్ స్టేటస్, పెద్దనోట్ల రద్దు సహా ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇటివలే పవన్ కళ్యాణ్ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ముగిసిపోయిన కధ చెబుతున్న కేంద్రాన్ని తగిన బుద్ది ప్రజలు చెబుతారని హెచ్చరించారు పవన్. అలాగే, మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పై కూడా ఒక్కింత అసహనం వ్యక్తం చేశారు. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ నిర్ణయాన్ని తీసుకొని గంధర గోళం చేశారని అభిప్రాయపడ్డారు పవన్. ఈ ఇలాంటి నేపధ్యంలో ఆయన సీపీఐ నేతలతో భేటీ కావడం ఒక్కింత ఆసక్తిగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com