ఎయిర్టెల్ వారి మరో ఆఫర్!
- December 02, 2016
దేశంలోనే తొలి చెల్లింపు బ్యాంక్ను ప్రారంభించిన టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో తొలిసారి సేవింగ్స్ ఖాతా తెరిచిన వినియోగదారులకు ప్రతీ రూపాయి డిపాజిట్పై ఒక నిమిషం ఉచిత కాల్స్(ఎయిర్టెల్ టు ఎయిర్టెల్) సౌకర్యాన్ని కల్పించింది. కేవలం తొలిసారి ఖాతా ప్రారంభించిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
'ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకులో మొదటిసారి ఖాతా ప్రారంభించిన ఏ వినియోగదారుడికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఖాతాలో జమ చేసే ప్రతీ రూపాయికి ఒక నిమిషం ఎయిర్టెల్ మొబైల్కు ఉచిత కాల్స్ అందిస్తాం' అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1000తో ఖాతాను ప్రారంభిస్తే అతని ఎయిర్టెల్ మొబైల్కు 1000 నిమిషాల ఉచిత టాక్టైం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ ఎయిర్టెల్ మొబైల్కైనా ఈ టాక్టైం వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
'ప్రతీ భారతీయుడి గడపకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్లో ఒక లక్ష మర్చెంట్లను ఇందులో భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం' అని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో శశి అరోరా వివరించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









