సైబర్ ఎటాక్స్పై నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ మానిటరింగ్
- December 03, 2016
జెడ్డా: నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, పలు ప్రభుత్వ ఏజెన్సీలు మరియు, సంస్థలపై జరుగుతున్న సైబర్ ఎటాక్స్పై దృష్టిపెట్టింది. దీనికి సంబంధించి రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. హ్యాకర్లు అక్రమంగా పలు సంస్థల వెబ్సైట్లలోకి చొరబడటం లేదా మాల్వేర్ని జొప్పించడం ద్వారా విలువైన డేటాను తస్కరిస్తుంటారు. పనిగట్టుకుని జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలపై ఫోకస్ పెట్టి, కొన్ని సంస్థల్ని కూడా గుర్తించిన నేషనల్ సెంటర్, ఆయా సంస్థలకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో వైపున కింగ్డమ్ బయటినుంచి కొన్ని దాడులు జరుగుతున్నాయనీ, ఆ కారణంగా ప్రభుత్వ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్ సెంటర్ సూచించింది. తమ డేటాను సేఫ్గార్డ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అనుమానాస్పదంగా వచ్చే మెయిల్స్ని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయరాదనీ, అలాగే ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే డేటా భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుని, సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలని నేషనల్ సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







