సైబర్‌ ఎటాక్స్‌పై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌

- December 03, 2016 , by Maagulf
సైబర్‌ ఎటాక్స్‌పై నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ మానిటరింగ్‌

జెడ్డా: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ, పలు ప్రభుత్వ ఏజెన్సీలు మరియు, సంస్థలపై జరుగుతున్న సైబర్‌ ఎటాక్స్‌పై దృష్టిపెట్టింది. దీనికి సంబంధించి రెగ్యులర్‌ మానిటరింగ్‌ చేస్తున్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. హ్యాకర్లు అక్రమంగా పలు సంస్థల వెబ్‌సైట్లలోకి చొరబడటం లేదా మాల్‌వేర్‌ని జొప్పించడం ద్వారా విలువైన డేటాను తస్కరిస్తుంటారు. పనిగట్టుకుని జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాలపై ఫోకస్‌ పెట్టి, కొన్ని సంస్థల్ని కూడా గుర్తించిన నేషనల్‌ సెంటర్‌, ఆయా సంస్థలకు వార్నింగ్‌ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో వైపున కింగ్‌డమ్‌ బయటినుంచి కొన్ని దాడులు జరుగుతున్నాయనీ, ఆ కారణంగా ప్రభుత్వ ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని నేషనల్‌ సెంటర్‌ సూచించింది. తమ డేటాను సేఫ్‌గార్డ్‌ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. అనుమానాస్పదంగా వచ్చే మెయిల్స్‌ని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్‌ చేయరాదనీ, అలాగే ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే డేటా భద్రతకు ప్రాధాన్యమిచ్చేలా చర్యలు తీసుకుని, సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేయాలని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ సెక్యూరిటీ హెచ్చరిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com