మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

- December 03, 2016 , by Maagulf
మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేసిన తెలంగాణ ప్రభుత్వం

మద్యం అమ్మకాల్లో చిల్లర సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు విజ్ఞప్తి చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరల్లో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చిల్లర సమస్య ఉత్పన్నంకాకుండా సమీప ధరను సవరిస్తూ ఉత్తర్వులిచ్చింది. మద్యంపై ఎక్సైజ్‌ డ్యూటీలో స్వల్ప మార్పులు చేసింది. లిక్కర్‌ మూల ధరపై 70శాతం ఎక్సైజ్‌ డ్యూటీ విధించింది. లైట్‌ బీర్‌పై 108శాతం, స్ట్రాంగ్‌ బీర్‌పై 115 శాతం ఎక్సైజ్‌ డ్యూటీ విధించారు. మద్యాన్ని ఎంఆర్‌పీ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com