దుబాయ్ బస్ క్రాష్: ఐదుగురి మృతి
- December 05, 2016
దుబాయ్: బస్సు, ట్రక్కు ప్రమాదానికి గురి అయిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. దుబాయ్లోని అల్ గర్హౌడ్ డైరెక్షన్లో అల్ రబాత్ స్ట్రీట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 20 మంది కార్మికులు వెళుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో. ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు అల్ రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమాద్ బిన్ సులైమాన్ చెప్పారు. ప్రమాద ఘటన గురించిన సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాల్ని పంపించినట్లు అధికారులు తెలిపారు. నలుగురు ప్రమాద స్థలంలోనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో మృతి చెందారు. నలుగురు గాయపడగా, అందులో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్ని వెనకనుంచి బస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రాఫిక్ పోలీస్, దుబాయ్ పోలీస్, రెస్క్యూ మరియు అంబులెన్స్ సర్వీసులు సకాలంలో ప్రమాద ఘటనపై స్పందించాయి. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించడమొక్కటే మార్గమని బ్రిగేడియర్ బిన్ సులైమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









