దుబాయ్ బస్ క్రాష్: ఐదుగురి మృతి
- December 05, 2016
దుబాయ్: బస్సు, ట్రక్కు ప్రమాదానికి గురి అయిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు మృతి చెందగా, నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. దుబాయ్లోని అల్ గర్హౌడ్ డైరెక్షన్లో అల్ రబాత్ స్ట్రీట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 20 మంది కార్మికులు వెళుతున్నారు ప్రమాదం జరిగిన సమయంలో. ఉదయం 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు అల్ రషిదియా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ హమాద్ బిన్ సులైమాన్ చెప్పారు. ప్రమాద ఘటన గురించిన సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాల్ని పంపించినట్లు అధికారులు తెలిపారు. నలుగురు ప్రమాద స్థలంలోనే చనిపోగా, ఒకరు ఆసుపత్రిలో మృతి చెందారు. నలుగురు గాయపడగా, అందులో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రక్ని వెనకనుంచి బస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ట్రాఫిక్ పోలీస్, దుబాయ్ పోలీస్, రెస్క్యూ మరియు అంబులెన్స్ సర్వీసులు సకాలంలో ప్రమాద ఘటనపై స్పందించాయి. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ పాటించడమొక్కటే మార్గమని బ్రిగేడియర్ బిన్ సులైమాన్ చెప్పారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







