వీసా బ్యాన్ మరో ఆరు నెలల పొడిగింపు
- December 05, 2016
మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, ప్రైవేట్ సెక్టార్లోని కొన్ని ప్రొఫెషన్స్కి చెందిన కార్మికులకు కొత్తగా వీసాలు జారీ చేయకుండా మరో ఆరు నెలలపాటు బ్యాన్ని పొడిగించింది. మూడేళ్ళుగా ఈ బ్యాన్ కొనసాగుతోంది. ఇందులో కన్స్ట్రక్షన్ వర్కర్స్, క్లీనర్స్, సేల్స్ మరియు మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ తదితర విభాగాలున్నాయి. మినిస్ట్రీ నవంబర్ 30న నాలుగు డెసిషన్స్ని వీసా బ్యాన్ని పొడిగిస్తూ తీసుకున్నారు. కార్పెంటర్స్, మెటల్లర్జిస్ట్స్, బ్లాక్స్మిత్స్, బ్రిక్ క్లిన్ వర్కర్స్కి ఈ బ్యాన్ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరికి డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. మిగతావారికి జనవరి 1, 2017 నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 2013లో విధించిన ఈ బ్యాన్కి సంబంధించి సేల్స్, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్, క్యామెల్ కీపర్స్ కోసం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. కార్పెంటర్లు, మెటలర్జిస్ట్స్, బ్లాక్స్మిత్స్, బ్రిక్ క్లిన్ వర్కర్స్కి సంబంధించిన నిర్ణయం జనవరి 1, 2014 నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్స్లెంట్, ఇంటర్నేషనల్ గ్రేడ్, కన్సల్టెన్సీస్, ప్రభుత్వ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తున్న సంస్థలపై ఈ నిర్ణయం తాలూకు ఎఫెక్ట్ ఏమాత్రం ఉండదు. యజమాని ద్వారా ఫుల్టైమ్ నిర్వహించేవి, రియాదాతో రిజిస్టర్ అయినవి, పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్తో ఇన్స్యూర్ అయినవీ దీన్నుంచి మినహాయింపు పొంది ఉన్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







