స్వదేశానికి వెళ్ళేందుకు దిక్కుతోచని స్థితిలో..
- December 05, 2016
మనామా: ఇమ్మాన్యుయేల్ అనే ఘనియన్ జాతీయుడి దయనీయ గాధ ఇది. ఆయన తన కుమారుడు పుట్టినప్పుడు కూడా స్వదేశానికి వెళ్ళలేకపోయాడు. దురదృష్టవశాత్తూ తన కుమారుడు మరణించినా, చూడ్డానికి వెళ్ళలేకపోయాడు. కారణం పేదరికం. తన పేదరికం కారణంగా స్పాన్సరర్ వద్ద ఇరుక్కుపోయిన ఆ వ్యక్తి రెండేళ్ళ తర్వాత తన స్వదేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ, ఇప్పటికీ స్పాన్సరర్ కరుణించడంలేదు. 2014లో బహ్రెయిన్కి వచ్చిన ఇమ్మాన్యుయేల్, మూవింగ్ సర్వీస్ కంపెనీలో చేరాడు. ఆగస్ట్ 15న కాంట్రాక్ట్ ముగిసినా, స్పాన్సరర్ మాత్రం ఇంకా అదే కంపెనీలో పనిచేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నాడు. పాస్పోర్ట్ ఇవ్వకుండా వేధిస్తున్నాడు. మైగ్రెంట్ వర్కర్స్ ప్రొటెక్షన్ సొసైటీ (ఎండబ్ల్యుపిఎస్) ఈ వివరాల్ని వెల్లడించింది. వీసా ఎక్స్పైర్ అయిపోవడంతో, అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితే ఇమ్మాన్యుయేల్ స్నేహితుడు జార్జ్కి ఎదురయ్యింది. జార్జ్ కూడా ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నాడు. మొహమ్మద్ అనే వ్యక్తి కూడా ఆ కంపెనీతో ఇవే సమస్యలను ఫేస్ చేయాల్సి వచ్చింది. తాను ఎలాగైనా తన స్వదేశానికి వెళ్ళాల్సి ఉందనీ, ఇక్కడే ఉండి పని చేయలేకపోతున్నాననీ కేవలం 100 బహ్రెయినీ దినార్స్ మాత్రమే తనకు జీతం వస్తోందని వాపోయాడు ఇమ్మాన్యుయేల్. సెలవు ఇస్తే, తిరిగి వచ్చి పనిచేసేందుకు సిద్ధమని స్పాన్సర్తో చెప్పినా అతను అంగీకరించడంలేదని ఇమ్మాన్యుయేల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







