షార్జాలో పదిమంది కార్మికులపై దూసుకువెళ్లిన బస్సు ఒకరు మృతి
- December 09, 2016
జన్మభూమిని..కుటుంబసభ్యులను వదలి ఎడారి దేశాలలో కొలువు కోసం వచ్చిన వారు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్జాలో ఒక బస్సు ఉద్యోగుల సమూహం మీదకు దూసుకుపోయింది. ఒక వ్యక్తి మరణించగా,మరో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన కార్మికులలో ఎనిమిది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీయులు ఉన్నారు. అల్ హంరియా ప్రాంతంలో ఒక రహదారి పక్కన వారు వేచి ఉన్న సమయంలో ఒక బస్సు వారిపై నుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులందర్నీ ఖలీఫా ఆస్పత్రికి తరలించారు అయితే వీరిలో ఒక 34 ఏళ్ల కార్మికుడు మరణించాడు ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలియడంతోనే పెట్రోల్ బృందం ట్రాఫిక్ నిపుణులు మరియు అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి కారకుడైన ఆసియా దేశానికి చెందిన డ్రైవర్ ను అదుపు లోనికి తీసుకున్నారు. మరణించిన కార్మికుని శరీరాన్ని మృతదేహాలను భద్రపరిచే గదికి తరలించబడింది.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







