షార్జాలో పదిమంది కార్మికులపై దూసుకువెళ్లిన బస్సు ఒకరు మృతి
- December 09, 2016
జన్మభూమిని..కుటుంబసభ్యులను వదలి ఎడారి దేశాలలో కొలువు కోసం వచ్చిన వారు ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. షార్జాలో ఒక బస్సు ఉద్యోగుల సమూహం మీదకు దూసుకుపోయింది. ఒక వ్యక్తి మరణించగా,మరో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన కార్మికులలో ఎనిమిది మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీయులు ఉన్నారు. అల్ హంరియా ప్రాంతంలో ఒక రహదారి పక్కన వారు వేచి ఉన్న సమయంలో ఒక బస్సు వారిపై నుంచి వేగంగా దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులందర్నీ ఖలీఫా ఆస్పత్రికి తరలించారు అయితే వీరిలో ఒక 34 ఏళ్ల కార్మికుడు మరణించాడు ప్రమాదం జరిగిన విషయం పోలీసులకు తెలియడంతోనే పెట్రోల్ బృందం ట్రాఫిక్ నిపుణులు మరియు అంబులెన్సులను ప్రమాద స్థలానికి తరలించారు. కాగా ఈ ప్రమాదానికి కారకుడైన ఆసియా దేశానికి చెందిన డ్రైవర్ ను అదుపు లోనికి తీసుకున్నారు. మరణించిన కార్మికుని శరీరాన్ని మృతదేహాలను భద్రపరిచే గదికి తరలించబడింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







