ఎన్టీఆర్‌ 27వ చిత్రాన్ని ప్రకటించిన కల్యాణ్‌రామ్‌

- December 09, 2016 , by Maagulf
ఎన్టీఆర్‌ 27వ చిత్రాన్ని ప్రకటించిన కల్యాణ్‌రామ్‌

 'జనతా గ్యారేజ్‌' తర్వాత ఎన్టీఆర్‌ నటించబోయే చిత్రాన్ని ఆయన సోదరుడు, హీరో కల్యాణ్‌రామ్‌ ప్రకటించారు. తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 'నా సోదరుడు ఎన్టీఆర్‌ 27వ చిత్రాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. దాన్ని మా సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నాం. బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు' అని కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌ చేశారు.మరి ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్నదీ కల్యాణ్‌రామ్‌ తెలుపలేదు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకుడు రెండు పాత్రల్లో కనిపించనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
కామెడీ, యాక్షన్‌ మిళితమైన పక్కా మాస్‌ కథతో స్క్రిప్టు సిద్ధమవుతోందని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com